ఎమ్మెల్సీగా కూచకుళ్ల ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-01-20T05:29:55+05:30 IST
శాసన మండలి సభ్యుడిగా కూచకుళ్ల దామోదర్రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెన్ స్పీకర్గా నియమించబడిన ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రి దామోదర్రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
నాగర్కర్నూల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): శాసన మండలి సభ్యుడిగా కూచకుళ్ల దామోదర్రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెన్ స్పీకర్గా నియమించబడిన ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రి దామోదర్రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దామోదర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం పాఠకులకు తెలిసిందే. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దామోదర్రెడ్డి ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కూచకుళ్ల దామోదర్రెడ్డి కుమారుడు రాజేష్రెడ్డి పాల్గొన్నారు.