వైద్యాలయంలో ట్యాప్ లీకైంది
ABN , First Publish Date - 2021-05-11T04:22:07+05:30 IST
ఎన్టీఆర్ వైద్యాలయంలోని కొవిడ్ వార్డు బాత్రూమ్లో ట్యాప్ లీకైందని సూపరింటెండెంట్ శ్రావణకుమార్ తెలిపారు.
సూపరింటెండెంట్ శ్రావణకుమార్
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
అనకాపల్లి, మే 10: ఎన్టీఆర్ వైద్యాలయంలోని కొవిడ్ వార్డు బాత్రూమ్లో ట్యాప్ లీకైందని సూపరింటెండెంట్ శ్రావణకుమార్ తెలిపారు. అందువల్లే వార్డుల్లోకి నీరు వచ్చిందని చెప్పారు. ‘కొవిడ్ వార్డు దారుణం’ అనే శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. అది మురుగునీరు కాదని, ట్యాపు లీకై నీరు బయటకు వచ్చిందని వివరించారు. దాన్ని గుర్తించి వెంటనే నీటిని తొలగించామని పేర్కొన్నారు.