2024లో ప్రొద్దుటూరులో ఎగిరేది టీడీపీ జెండానే

ABN , First Publish Date - 2022-07-01T04:57:11+05:30 IST

తాను బతికుండగా ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురనీయనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అహంకార ధోరణితో ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవానికి 2024లో ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

2024లో ప్రొద్దుటూరులో ఎగిరేది టీడీపీ జెండానే

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 30 : తాను బతికుండగా ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురనీయనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అహంకార ధోరణితో ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవానికి 2024లో ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ దర్గాచెట్టు కూల్చివేతలో సొంతపార్టీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లే ఎదురుతిరిగి ధర్నా చేశారని, దీనిని బట్టి చూస్తే ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే పూర్తి వ్యతిరేకత వచ్చిందన్న విషయం ప్రజలకు స్పష్టమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేను విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యే తనకు ముఖ్యులు అనుకుంటున్న వారే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అది తెలుసుకుంటే మంచిదన్నారు.   

Updated Date - 2022-07-01T04:57:11+05:30 IST