మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-03-23T02:13:44+05:30 IST

రాష్ట్రానికి మూడు రాజధానులు అనేవి తమ పార్టీ, ప్రభుత్వ విధానమని

మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులు అనేవి తమ పార్టీ, ప్రభుత్వ విధానమని మంత్రి బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణకు కట్టుబడి  తాము ఉన్నామన్నారు. సమయాన్ని బట్టి సభలో మూడు రాజధానుల బిల్లు పెడతామన్నారు. మూడు రాజధానుల విధానమే తమ నిర్ణయమని ఆయన ప్రకటించారు. తాము మొదటి నుండి అదే చెప్తున్నామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో అని ఆయన అన్నారు. ఏదైనా పాజిటివ్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామన్నారు. అన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సంఘాల వారికి నాలుగో తేదీన రమ్మని చెప్పామన్నారు. ఎవరు ఎప్పుడు కోరితే అప్పుడు టైం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ స్కూల్సులో టీచర్ల సంఖ్య పెంచాలని అడిగారన్నారు. పీఎఫ్ వంటి సమస్యలు అడిగారని, వాటన్నింటినీ పరిష్కారిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-23T02:13:44+05:30 IST