భారత్కు కాబుల్ గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు!
ABN , First Publish Date - 2021-08-24T16:54:11+05:30 IST
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో చిక్కుకున్న భారతీయులను...
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఎయిర్ ఇంఢియా విమానం(ఏఐ1956)లో కాబుల్ నుంచి 78 మంది ప్రయాణీకులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 25 మంది భారతీయులు ఉన్నారు. వీరితో పాటు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. సిక్కు సమాజానికి చెందిన కొంతమంది కాబుల్లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్కు చెందిన మూడు ప్రతులను తమ తలలపై పెట్టుకుని, ఇక్కడికి తీసుకు వచ్చారు. వీటిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్పురి తదితరులు స్వీకరించారు.