రైలు రోడ్డుపై పరుగెడుతుంది!

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

రైలు ప్రయాణం మీరు చేసే ఉంటారు. రైలు దిగగానే మీ గమ్యం చేరుకోవడానికి తిరిగి బస్సు ఎక్కుతుంటారు.

రైలు రోడ్డుపై పరుగెడుతుంది!

వినూత్నం

రైలు ప్రయాణం మీరు చేసే ఉంటారు. రైలు దిగగానే మీ గమ్యం చేరుకోవడానికి తిరిగి బస్సు ఎక్కుతుంటారు. కానీ ఈ రైలు ఎక్కితే మాత్రం ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఇది డ్యూయల్‌ మోడ్‌ వెహికిల్‌. పట్టాలపై నుంచి దిగగానే సాధారణ బస్సులా రోడ్డుపై పరుగులు పెడుతుంది. జపాన్‌లోని కైయో పట్టణంలో ఇటీవలే ఈ డ్యుయల్‌ మోడ్‌ వెహికల్‌ను ప్రదర్శించారు. ప్రపంచంలో మొట్టమొదటి డ్యుయల్‌ మోడ్‌ వెహికిల్‌ ఇదే. సాధారణ బస్సు నుంచి పట్టాలపై రైలులా పరుగెత్తేందుకు అనువుగా మారడానికి 15 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈ వెహికల్‌ రైలుగానూ, లోకల్‌ బస్సుగానూ ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణా కోసం చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు. రైలుగా గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అదే బస్సుగా అయితే గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. డీజిల్‌తో నడిచే ఈ వాహనంలో 21 మంది వరకు ప్రయాణించే వీలుంది. 

Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST