ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ
ABN , First Publish Date - 2022-01-28T02:40:24+05:30 IST
ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసులపై శుక్రవారం
అమరావతి: ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసులపై శుక్రవారం విచారణ జరుగనుంది. ఉదయం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభమవుతుంది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ మళ్లీ ప్రవేశపెడతామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో తమ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరపు లాయర్లు కోరుతున్నారు. ఏ అంశాలపై విచారించాలో అఫిడవిట్లు వేయాలని గతంలో హైకోర్టు కోరింది. ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనాతో థర్డ్ వేవ్ విజృంభించడంతో హైకోర్టులో వర్చువల్ విచారణ జరుగనుంది.