వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకం

ABN , First Publish Date - 2022-06-27T05:11:52+05:30 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకమని మోపాడు రిజర్వాయర్‌ మాజీ చైర్మన్‌ అడుసుమల్లి ప్రభాకర్‌ చౌద రి అన్నారు.

వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకం
మాట్లాడుతున్న అడుసుమల్లి

పామూరు, జూన్‌ 26 : వచ్చే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకమని మోపాడు రిజర్వాయర్‌ మాజీ చైర్మన్‌ అడుసుమల్లి ప్రభాకర్‌ చౌద రి అన్నారు. స్థానిక శేషమహల్‌ ప్రాంగంలో టీడీపీ మండల క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జిల ఎంపిక సమావేశం ఆదివారం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చె ప్పాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి, పట్టణాధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా, మండల క్లస్టర్‌ 1 ఇన్‌చార్జి  గుంటుపల్లి శ్రీనివాసులు, గంగరాజు, ప్రసాద్‌రెడ్డి, సయ్యద్‌ అమీర్‌బాబు, సుభాషిణి,  శేషాద్రి, సుబ్బారావు,  హరిబాబు, ఇర్రికోటిరెడ్డి, పువ్వాడి రామా రావు, హరీష్‌,  రమణయ్య, గౌస్‌బాషా, రఫీమస్తాన్‌వలి పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T05:11:52+05:30 IST