భారత్‌కు బాకీపడ్డ అమెరికా!

ABN , First Publish Date - 2021-02-27T21:21:20+05:30 IST

అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయట. అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.15లక్షల కోట్లు)ను రుణపడి ఉందట. ఇదేదో గాలి వార్త కాదు. స్వ

భారత్‌కు బాకీపడ్డ అమెరికా!

వాషింగ్టన్: అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయట. అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.15లక్షల కోట్లు)ను రుణపడి ఉందట. ఇదేదో గాలి వార్త కాదు. స్వయంగా ఆ దేశ చట్టసభల సభ్యుడే ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ అమెరికాపై పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. కాగా.. ఈ ఉద్దీపన ప్యాకేజీపై చట్టసభల సభ్యులు ప్రస్తుతం చర్చిస్తున్నారు.




ఈ సందర్భంగా దిగువ సభ(ప్రతినిధుల సభ) సభ్యుడు అలెక్స్ మూనీ.. అగ్రరాజ్యం అప్పుల చిట్టా విప్పారు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రకారం దేశంలోని ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్టు ఆయన వివరించారు. కాగా.. ప్రస్తుతం అమెరికా అప్పులు ప్రస్తుతం 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపారు. చైనా, జపాన్ దేశాలకు ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందన్నారు. అంతేకాకుండా.. భారత్‌కు 216 బిలియన్ డాలర్లను రుణపడి ఉందని అలెక్స్ మూనీ వెల్లడించారు. 1.9ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-02-27T21:21:20+05:30 IST