అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-05-23T06:15:36+05:30 IST
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ద్యేయమని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ అన్నారు.
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ
జగిత్యాల టౌన్, మే 22 : అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ద్యేయమని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్సీ రమణ పర్యటించారు. పట్టణంలోని గోవిందు పల్లిలో నిర్మిస్తున్న వడ్డెర సంఘ భవన నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను అదేశించారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు మొగిలి, నాయకులు వొల్లెం మల్లేశం, అయుల్నేని సాగర్ రావు, బోగ ప్రవీణ్ కుమార్ ,కోరుకంటి రాము, చెన్న రాము తదితరులు ఉన్నారు. అలాగే ఇటీవల మృతి చెందిన మల్యాల మండలం మ్యాడంపెల్లికి చెందిన ముదుగంటి వెంకట్ రెడ్డి, జగిత్యాల పట్టణంలోని బాశెట్టి కళావతి, జాబితా పూర్ గ్రామానికి చెందిన అరిగెల వెంకన్న కుటుంబాలను ఎమ్మెల్సీ రమణ పరామర్శించి తన ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. అలాగే జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టు సతీష్ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోగా ఎమ్మెల్సీ పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు బోగ వెంకటేశ్వ ర్లు, పోతారం పీఏసీఎస్ చైర్మన్ సాగర్ రావు ఉన్నారు.