రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2021-05-10T06:56:56+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : భాస్కర్‌రావు
చెక్‌డ్యాం నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మాడ్గులపల్లి, మే 9 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో కలిసి మండలంలోని బొమ్మకల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పాలేరు వాగుపై చేపడు తున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాలేరువాగుపై చెక్‌డ్యాం నిర్మిస్తే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ ద్వారా దీన్ని మ ంజూరు చేయించామన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే బొమ్మకల్‌, భీమనపల్లి, చర్లగూడెం తదితర గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి దాదాపు 700ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో కోఆప్షన జిల్లా సభ్యుడు మోసినఅలీ, ఎంపీపీ పోకల శ్రీవిద్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు మిర్యాల మధుసూదన, సర్పంచలు మారుతి వెంకట్‌రెడ్డి, మేకల లింగమ్మ, గడ్డమీది సైదులు, పీఏసీఎస్‌ ఛైర్మన జెర్రిపోతుల రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:56:56+05:30 IST