రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-07T05:46:42+05:30 IST

రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి అన్నారు.

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
చిన్నబొంకూరులో గోదామును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

సుల్తానాబాద్‌, జూలై 6: రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలం లోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్‌ నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించిన గోదామును బుధవా రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలను ఆయా గోదాముల్లో అందుబా టులో ఉంచుతున్నారన్నారు. ఎరువుల కోసం రైతులు మండల కేంద్రానికి, చిన్నకలువలకు రానవసరం లేకుండా ఆయా గ్రామాల్లో ఉన్న గోదాముల్లోనే విక్ర యిస్తున్నారన్నారు. కేడీసీసీబీ డైరక్టర్‌ మోహన్‌రావు మాట్లాడుతూ చిన్నకలువల సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో గోదాములను నిర్మించుకున్నామని, ప్రతి వ్యవసాయ సీజన్‌లో రైతుల అవసరమైన వాటిని ఈ గోదాముల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకా ష్‌రావు, సర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ ఫకీర్‌యాదవ్‌, సీఈవో వల్లంకొం డ రమేష్‌, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:46:42+05:30 IST