రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-01T05:59:35+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కీసరలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • గిడ్డంగి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి

కీసర, జూన్‌ 30: రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు. కీసరలో నాబార్డ్‌ నిధులు 1.57లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి మంత్రి, జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు. వానకాలం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. రైతుల ధాన్యం నిల్వకు నిర్మించే గోడౌన్‌ నిర్మాణంలో నాణ్యత లోపించకుండా అధికారుల చూసుకోవాలని సూచించారు. త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ పి.వెంకటేష్‌, ఎంపీపీ ఎం.ఇందిరలక్ష్మీనారాయణ, పాక్స్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:59:35+05:30 IST