పేదల సంక్షేమమే ప్రఽభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-07T06:53:49+05:30 IST

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కరోనా విపత్కర పరిస్థితుల్లో నూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవీ రాజు అన్నారు.

పేదల సంక్షేమమే ప్రఽభుత్వ ధ్యేయం
వేములవాడలో కల్యాణలక్ష్మి చెక్కు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

- వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవీరాజు 

- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

వేములవాడ, మే 6: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కరోనా విపత్కర పరిస్థితుల్లో నూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవీ రాజు అన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గురువారం చైర్‌పర్సన్‌ అందజేశారు. మొత్తం 101 మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరు అయ్యాయని, వీటిని ఆయా వార్డుల కౌన్సిలర్ల చేతుల మీదుగా అందజేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2021-05-07T06:53:49+05:30 IST