పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2021-06-13T06:35:53+05:30 IST
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డివెంకటరామిరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి
ధర్మవరంఅర్బన, జూన 12: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డివెంకటరామిరెడ్డి అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిఽథిగృహ ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే బా ధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కులను పం పిణీ చేశారు. నియోజకవర్గంలోని 114 మందికి 32.53లక్షల చెక్కులను ఎమ్మె ల్యే స్వయంగా బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదలకు అండగా ఉండేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేసిన రాష్ట్రం దేశంలో ప్రథమస్థానంలో ఉందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ కింద ధర్మవరం అర్బనలో 53మందికి రూ.12.15లక్షలు, ధర్మవరంరూరల్లో 15 మందికి రూ.2.64 లక్షలు, ముది గుబ్బ మండలంలో 19మందికి రూ.2.98లక్షలు, బత్తలపల్లిమండలంలో 16 మందికి రూ.4.7లక్షలు, తాడిమర్రి మండలంలో 9మందికి రూ.1.59లక్షలు ఆర్థికసాయం చొప్పున మొత్తంరూ.32.53లక్షలు చెక్కులను అందజేశా మన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకుండా వివిధ రోగాల బారిన పడి ప్రైవేటు ఆస్పత్రిలలో చికి త్సలు చేయించుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్కింద సాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అత్తర్జిలాన, బ్రహ్మ, చింతా యల్లయ్య, గడ్డంరంగ, వైసీపీ జిల్లాఅధికార ప్రతినిధి గుర్రంశ్రీనివాసరెడ్డి, నా యకులు అప్రాచెరువు ఈశ్వర్రెడ్డి, సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.