పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానం
ABN , First Publish Date - 2020-08-08T08:11:54+05:30 IST
పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానమని బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు.
గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానమని బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ఉద్యోగులతో ఆయన సమీక్షించారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా రఘునాథబాబును అధికారులు, ఉద్యోగులు అభినంధించారు.
ఆరుగురికి ఉద్యోగోన్నతులు...
బోర్డులో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ ఉద్యోగులకు మేనేజర్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఆయా అధికారులకు చైర్మన్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.