ఊరంతా ఒకే మాట... టీడీపీ బాట

ABN , First Publish Date - 2022-06-27T06:45:30+05:30 IST

రామకుప్పం మండలంలోని పంద్యాలమడుగు పం చాయతీ కావలి మడు గుకు చెందిన గ్రామ స్తులంతా ఏక తాటి పై నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంపై సం పూర్ణ విశ్వాసం ప్రక టించారు.

ఊరంతా ఒకే మాట... టీడీపీ బాట
వైసీపీ సానుభూతిపరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మనోహర్‌

రామకుప్పం, జూన్‌ 26: మండలంలోని పంద్యాలమడుగు పం చాయతీ కావలి మడు గుకు చెందిన గ్రామ స్తులంతా ఏక తాటి పై నిలిచారు. టీడీపీ అధినేత  చంద్రబాబు  నాయకత్వంపై సం పూర్ణ విశ్వాసం ప్రక టించారు. ఇటీవల సర్పంచు ఎన్నికల్లో ఆ గ్రామంలో టీడీపీకి 100ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా గ్రామంలోని కొందరు వైసీపీ సానుభూతిపరులు టీడీపీలో చేరారు. గ్రామంలో సుమారు 130 యానాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల్లో ఆనందప్ప, చంద్రశేఖర్‌, హరీష్‌, గోవిందప్ప కుటుంబాలు వైసీపీ  సానుభూతిపరులు. గ్రామస్థుల సూచన మేరకు వారు కూడా టీడీపీలో చేరారు. శనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్‌ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ గ్రామంలో ఉప్పటి వరకు 80శాతం మంది టీడీపీ సభ్యత్వాలు స్వీకరించారన్నారు. మిగిలినవారు కూడా సభ్యత్వాలు తీసుకు నేం దుకు ముందుకు వచ్చారన్నారు. వారికి తాను పార్టీ అధినేత తరుపున కృతజ్ఞతలు తెలపుతున్నానన్నారు. ఈ కర్యాక్రమంలో ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణానాయక్‌, యూనిట్‌ ఇన్‌చార్జి గంట్లప్పగౌడు, తెలుగుయువత మండల అధ్యక్షుడు విశ్వనాథ్‌, శ్రీనివాసులుగౌడు, గంట్లప్ప, మురుగేష్‌, గోవిందప్ప, పార్థ, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T06:45:30+05:30 IST