కొద్ది రోజుల క్రితమే పెళ్లి.. సడన్‌గా ఇంట్లోంచి మంటలు.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. పోలీసులు ఆరా తీస్తే బయటపడ్డ నిర్వాకం..!

ABN , First Publish Date - 2022-05-07T01:06:36+05:30 IST

ఆ ఇద్దరికీ కొన్ని రోజుల క్రితమే వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా ఆ నవదంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే సడన్‌గా వాళ్లు నివసిస్తున్న ఇంట్లోంచి మంటలు చెలరేగాయి.

కొద్ది రోజుల క్రితమే పెళ్లి.. సడన్‌గా ఇంట్లోంచి మంటలు.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. పోలీసులు ఆరా తీస్తే బయటపడ్డ నిర్వాకం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరికీ కొన్ని రోజుల క్రితమే వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా ఆ నవదంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే సడన్‌గా వాళ్లు నివసిస్తున్న ఇంట్లోంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆ భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. దీంతో అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇంతకూ మ్యాటర్ ఏంటంటే.. 



ఢిల్లీకి చెందిన సోహెల్ అనే యువకుడికి హసీనా అనే యువతికి గత ఏడాది అక్టోబర్‌లో వివాహం జరిగింది. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ నవదంపతులు ఆనంద్ పార్వత్ ప్రాంతంలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు ఉంటున్న ఇంట్లో తాజాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ సోహెల్, హసీనాను ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీసిన అధికారులకు  విస్తుపోయే నిజాలు తెలిసాయి. విచారణ సందర్భంగా సోహెల్‌ను విచారించిన అధికారులు అతడు చెప్పిన మాటలు విని షాకయ్యారు. 


అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి తానే కారణమని సోహెల్ చెప్పాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా వంట వండటానికి తన భార్య నిరాకరించిందని తెలిపాడు. ఈ  క్రమంలోనే హసీనాను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందకు సిద్ధమైనట్లు వివరించాడు. సోహెల్ నోటి నుంచి ఈ మాటలు విని అధికారులు నోరెళ్లబెట్టారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Read more