మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2021-07-25T05:49:34+05:30 IST

మండలంలోని యాదవాడ గ్రామాని కి చెందిన చాకలి సుబ్బలక్ష్మి(27) తొమ్మిది రోజుల నుంచి కన్పిం చడం లేదని తల్లి బాలమద్దమ్మ శనివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది.

మహిళ అదృశ్యం

ఆళ్లగడ్డ, జూలై 24: మండలంలోని యాదవాడ గ్రామాని కి చెందిన చాకలి సుబ్బలక్ష్మి(27) తొమ్మిది రోజుల నుంచి కన్పిం చడం లేదని తల్లి బాలమద్దమ్మ శనివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు తెలిపారు. చాకలి సుబ్బల క్ష్మి తన తమ్ముడు వంశీ వివాహం కోసం యాదవాడకు వచ్చి ఈ నెల 15న తిరిగి అత్తగారి ఇళ్లు దొర్నిపాడు మండలం డబ్ల్యు. గోవిందిన్నెకు వెళ్తున్నాన ని చెప్పి బయలుదేరింది. అయితే అత్తగారింటికి వెళ్లలేదని తెలిసి బంధువుల ఇళ్లకు ఫోన్‌ చేసి విచారించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Updated Date - 2021-07-25T05:49:34+05:30 IST