గుంతలో పడి మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-18T04:26:49+05:30 IST
జేసీబీ తీసిన గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని బైలంపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది.
ములుగు, అక్టోబరు 17 : జేసీబీ తీసిన గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని బైలంపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పల్లె ఎల్లమ్మ (45) దసరా పండుగ రోజు సాయంత్రం జంబికి వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అంతటా వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం ఇంటి ఎదుట ఉన్న జేసీబీ తీసిన గుంతలో శవమై తేలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగా కృష్ణ తెలిపారు.