AP News: టీడీపీ నేత ఫ్లాట్ను కబ్జా చేసిన వైసీపీ నేతలు... పట్టించుకోని పోలీసులు
ABN , First Publish Date - 2022-09-09T15:48:06+05:30 IST
జిల్లాలోని ఆదోనిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.
కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో వైసీపీ నేతలు (YCP Leaders) రెచ్చిపోయారు. ఆర్టీసీ కాలనీలో టీడీపీ (TDP) కర్నూలు పార్లమెంట్ కార్యదర్శి బుద్ధారెడ్డి (Budda reddy)కి చెందిన ప్లాట్ను వైసీపీ నేతలు కబ్జా చేశారు. గత నెల 9 వైసీపీ నాయకులు రాధాకృష్ణ, మహానంది తన ప్లాట్లలో అక్రమంగా ప్రవేశించి కబ్జా చేశారని టూ టౌన్ పోలీసులకు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. కాగా... బాధితుడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ, రిజిస్టర్ పోస్టులో బాధితుడు బుద్దారెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే దిగొచ్చిన పోలీసులు ఈనెల 7న ఇద్దరు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.