వైసీపీ పాలన అవినీతిమయం
ABN , First Publish Date - 2021-07-30T05:27:02+05:30 IST
వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు విమర్శించారు.
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు విమర్శించారు. పార్టీ జిల్లా కా ర్యాలయంలో గురువారం ఆయన విలే కరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాం గ ఉల్లంఘనలు, చట్టాల ధిక్కరణ జరు గుతుందన్నారు. జగన్ రెడ్డి దళిత ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని విమర్శించారు. ఏం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ కేసును పెట్టారని కృష్ణా జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణపై దాడికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయలేదో పోలీసులు చెప్పాలన్నారు. వైసీపీ నేతలకు ఒక చట్టం, టీడీపీ నేతలకు మరో చట్టాన్ని అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బోనెల అప్పారావు, ఎస్వీ రమణ పాల్గొన్నారు.