చికిత్స పొందుతూ యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-04-15T05:31:44+05:30 IST
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఎస్ఐ ప్రయాగమూర్తి తెలిపారు.
కొత్తవలస, ఏప్రిల్ 14: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఎస్ఐ ప్రయాగమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సంతపాలెం గ్రామానికి చెందిన వెన్నెల పవన్కుమార్(19) ఈ నెల 11న సబ్బవరం నుంచి సంతపాలెం గ్రామానికి రాత్రి 9 గంటల సమయంలో మోటార్ సైకిల్పై వస్తుండగా సంతపాలెం గ్రామ సమీపంలో రెల్లి కొంపలు వద్ద కుక్క అడ్డంగా రావడంతో సడన్ బ్రేక్ వేసి రోడ్డు మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే క్షతగాత్రున్ని విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి వెన్నెల సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి విశాఖపట్టణం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.