చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-27T05:36:31+05:30 IST

దొర్నిపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి నంద్యాల ప్రభుత్వ ఆస్పతిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

దొర్నిపాడు, అక్టోబరు 26: దొర్నిపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి నంద్యాల ప్రభుత్వ ఆస్పతిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఎస్‌ఐ కీర్తి తెలిపిన వివరాల మేరకు ఈనెల 23న ఎవరు లేని సమయంలో ఇంటి ఆవరణలో మద్దిలేటి (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఎర్రన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-10-27T05:36:31+05:30 IST