సాగర్‌ ఎడమ కాల్వలో పడి యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2021-02-28T05:15:32+05:30 IST

దోసపహాడ్‌ గ్రామసమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వలో యువకుడు శనివారం గల్లంతయ్యాడు.

సాగర్‌ ఎడమ కాల్వలో పడి యువకుడి గల్లంతు

పెన్‌పహాడ్‌, ఫిబ్రవరి 27 :  దోసపహాడ్‌ గ్రామసమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వలో యువకుడు శనివారం గల్లంతయ్యాడు. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌(28) మూడురోజుల కిందట దోసపహాడ్‌లోని అత్తారింటిలో ఉన్న భార్య యాకుబ్‌బేగంను తీసుకెళ్లడానికి వచ్చాడు. సాగర్‌ ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లి కాల్వలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కాల్వ సమీపంలోని మహిళ కాపాడే ప్రయత్నం చేసినా నీటి ఉధృతికి కొట్టుకుపో యాడు. మస్తాన్‌కు భార్య, కూతురు ఉన్నారు. గల్లంతైన యువకుడి కోసం సాగర్‌ ఎడమ కాల్వపై బంధుమిత్రులు వెతుకుతున్నారు

Updated Date - 2021-02-28T05:15:32+05:30 IST