చెరువులో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-03-01T05:18:29+05:30 IST
డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువకుడు చెరువులో పడి మృతిచెందిన సంఘటన కందిలో ఆదివారం చోటు చేసుకున్నది.
కంది, ఫిబ్రవరి 28 : డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువకుడు చెరువులో పడి మృతిచెందిన సంఘటన కందిలో ఆదివారం చోటు చేసుకున్నది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ కె.సుభాష్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్కుమార్ (21) ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటలకు డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఉదయం వరకూ తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు ఫోన్చేయగా స్విచాఫ్ అని వచ్చింది. ఇదిలా ఉండగా శనివారం మఽధ్యాహ్నం 1.30 గంటలకు స్నేహితునికి తాను కంది కిసాన్సాగర్ చెరువులో పడి చనిపోతున్నానని మెసేజ్ చేశాడని గ్రామస్థులు నవీన్ కుటుంబసభ్యులకు తెలిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నవీన్ మృతదేహం లభ్యమైంది. నవీన్ మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి కుమ్మరి విఠల్ సంగారెడ్డి రూరల్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.