కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..

ABN , First Publish Date - 2022-09-22T00:12:02+05:30 IST

వారిద్దరికీ ఇటీవలే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డిసెంబర్‌లో వివాహం జరిపించేలా మాట్లాడుకున్నారు. కాబోయే భార్యను చూసేందుకు యువకుడు తరచూ ఆమె ఇంటికి..

కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..

వారిద్దరికీ ఇటీవలే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డిసెంబర్‌లో వివాహం జరిపించేలా మాట్లాడుకున్నారు. కాబోయే భార్యను చూసేందుకు యువకుడు తరచూ ఆమె ఇంటికి వెళ్లివస్తుండేవాడు. కాబాయే భర్తే కావడంతో ఆమె కూడా చనువుగా ఉండేది. అయితే ఓ రోజు ఆమెను తనతో పాటూ బయటికి తీసుకెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి.. తాకరాని చోట తాకడం మొదలెట్టాడు. అంతటితో ఆగకుండా శారీరకంగా ఇబ్బంది పెట్టాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తనలోని శాడిజాన్ని చూపించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌ పరిధి డీడీ నగర్‌లో ఉంటున్న 30ఏళ్ల యువతికి.. బిర్లా నగర్ లైన్ నంబర్-3లో నివాసముంటున్న యువకుడితో జూలై 8న నిశ్చితార్థం (Engagement) జరిగింది. ఈ సమయంలో కట్నం కింద రూ.5లక్షలు ఇచ్చారు. పెద్ద హోటల్‌లో వేడుకను ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 8న వివాహం జరిపించేలా మాట్లాడుకున్నారు. ఇదిలావుండగా, కాబోయే భార్యను చూసేందుకు యువతకుడు రోజూ ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. కాబోయే భర్తే కావడంతో ఆమె కూడా రోజూ అతడితో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఆమెను తీసుకుని బయటికి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో చూసి తాకరాని చోట తాకుతూ (Indecent behavior) ఉండేవాడు. కాబోయే భర్తే కావడంతో ఆమె కూడా సీరియస్‌గా తీసుకోలేదు.

తలుపులు వేసిన ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించిన స్థానికులు.. టెర్రస్‌ పైకి వెళ్లి పరిశీలించగా షాకింగ్ సీన్..


అయితే అంతటితో ఆగని యువకుడు.. తర్వాత అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదనంగా కారు కొనివ్వడంతో పాటూ, రూ.5లక్షలు ఇవ్వాలని.. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానంటూ బెదిరించాడు. అంత డబ్బులు తాము ఇవ్వలేమని యువతి కుటుంబ సభ్యులు అనడంతో పెళ్లి చేసుకోనని ప్లేటు మార్చాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థ సమయంలో రూ.5లక్షలతో పాటూ గొలుసు, ఉంగరం కూడా ఇచ్చామని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే కార్యక్రమం నిర్వహణకు తమకు రూ.2లక్షలు ఖర్చయిందని వాపోయారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..



Updated Date - 2022-09-22T00:12:02+05:30 IST