యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-11T04:48:17+05:30 IST

మండల పరిధిలోని కోనంపేట గ్రామానికి చెందిన సర్తాజ్‌ఉన్నీసా (21) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.

యువతి ఆత్మహత్య

లక్కిరెడ్డిపల్లె, మే 10: మండల పరిధిలోని కోనంపేట గ్రామానికి చెందిన సర్తాజ్‌ఉన్నీసా (21) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు....తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బి.ఫార్మసి చదువుతున్న సర్తాజ్‌వున్నీషా కరోనా కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఆమె సొంత గ్రామమైన కోనంపేటకు పది రోజుల కిందట వచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో కానీ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-05-11T04:48:17+05:30 IST