యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2022-06-30T08:11:35+05:30 IST
అక్కా, బావ వద్దకు వెళ్లొస్తానని వెళ్లిన యువతి అదృశ్యమైంది. .ఈ ఘటన మండల పరిధిలోని హుస్సేనాబాదలో చోటుచేసుకుంది.
మోతె, జూన్ 29: అక్కా, బావ వద్దకు వెళ్లొస్తానని వెళ్లిన యువతి అదృశ్యమైంది. .ఈ ఘటన మండల పరిధిలోని హుస్సేనాబాదలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మండవ రాములు, కృష్ణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. చివ్వెంల మండల బీబీగూడెంలో ఉన్న రెండో కుమార్తె వద్దకు వెళ్తానని చిన్న కుమార్తె అఖిల ఈ నెల 25వ తేదీన ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ తెలియరానందున తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.