ఉద్యమ స్ఫూర్తితో యువకులు ముందుకెళ్లాలి
ABN , First Publish Date - 2022-08-10T06:11:43+05:30 IST
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో యువకులు ముం దుకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు
కోరుట్ల రూరల్, ఆగస్టు 9 : స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో యువకులు ముం దుకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. మంగళవారం మండలంలోని అయిలాపూర్ గ్రామంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అజాదీ కా గౌరవ్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. గ్రామంలోని అంబేడ్కర్ వి గ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడారు. బ్రి టీష్ కబంద హస్తాల నుంచిభారత జాతికి విముక్తి లభించి 75 ఏళ్లు గడిం చిం దన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపా రు. కాంగ్రెస్ పరిపాలనలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిదని అన్నారు. గ్రామంలోని పలు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతం రాజం, సత్యనారాయణ, హన్మక్క, ఎనుగందు ల పద్మ, అంజిరెడ్డి, నక్క సుదీర్, పుల్లారెడ్డి, రెఫ్సాన్ రాజం, ప్రతాప్, మరుపాక సుమన్, మారంపల్లి అంజయ్య, శంకర్, కిరణ్, శశీంధర్ రెడ్డి, లింబాద్రిలతో పాటు పలువురు పాల్గొన్నారు.