రెండు షాపుల్లో చోరీ
ABN , First Publish Date - 2021-05-11T04:47:34+05:30 IST
పోరుమామిళ్లలోని ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న తిరుమల సైకిల్ మార్ట్ షాపులో, వినాయక ఎలక్ర్టిక్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
87 వేల నగదు, రెండు టీవీలు అపహరణ
పోరుమామిళ్ల, మే 10: పోరుమామిళ్లలోని ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న తిరుమల సైకిల్ మార్ట్ షాపులో, వినాయక ఎలక్ర్టిక్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తిరుమల సైకిల్ మార్ట్ యజమాని రామక్రిష్ణ, వినాయక ఎలక్ట్రికల్ షాపు యజమాని ఫణి నాగరాజు సోమవారం ఉదయం షాపులు తెరిచేందుకు వెళ్లగా షాపుల్లో చోరీ జరిగినట్లు గుర్తించారన్నారు. రామక్రిష్ణకు సంబంధించి 60 వేల నగదు, ఫణి నాగరాజుకు సంబంధించి రూ.27 వేలు నగదు, రెండు టీవీలు చోరీకి గురయ్యాయని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ మోహన్ సంఘటనాస్థలానికి వెళ్లి చోరీ జరిగిన షాపులను పరిశీలించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.