తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-07-27T06:55:17+05:30 IST
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి వెళుతున్న దొంగను పక్కింటి యువకుడు పట్టుకున్నాడు
పట్టుబడిన దొంగ
వలిగొండ, జూలై 26: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి వెళుతున్న దొంగను పక్కింటి యువకుడు పట్టుకున్నాడు. ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపిన వివ రాల ప్రకారం.. వలిగొండ మదిర చింతబావికి చెందిన కొమిరెల్లి రవీందర్ రెడ్డి ఇంటికి తాళం వేసి తాళం చెవిని కిటికీ మచ్చుపై భద్రపర్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించడానికి కుటుంబసభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు. తాళం చెవిని గమనించిన పులిగిల్లకు చెందిన వేముల ప్రశాంత్ సోమవారం సాయంత్రం ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. 10 గ్రాముల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, గ్యాస్ సిలిండర్ చోరీ చేశారు. యథావిధిగా ఇంటికి తాళం వేసి వెళుతుండగా ఆ ఇంటి పక్కనే ఉన్న కొమిరెల్లి ఉపేందర్రెడ్డి అనే యువకుడు చూసి నీవెవరు? అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఉడాయించడానికి యత్నించిన ప్రశాంత్ను ఉపేందర్రెడ్డి పట్టుకుని ఇంటి యజమాని రవీందర్రెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చి పోలీసులకు అప్పగించాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపారు.