తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2022-06-30T04:58:29+05:30 IST
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీలోని తాళం వేసిన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కిలో వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లా రు.
నారాయణపేట క్రైం, జూన్ 29 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీలోని తాళం వేసిన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కిలో వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లా రు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని సత్యసాయికాలనీలో గల ఓ బిల్డింగ్ పై అంతస్తులో జాదవ్రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా ఇదే అదునుగా భావిం చిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న వెండి వస్తువులతో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లారు. విష యం తెలుసుకున్న సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ సురేష్గౌడ్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకొని నిందితుల ఆచూకి కోసం ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.