బిరదవోలులో పట్టపగలు చోరీ
ABN , First Publish Date - 2022-07-08T04:18:26+05:30 IST
మండలంలోని బిరదవోలు గ్రామంలో గురువారం పట్టపగలు చోరీ జరిగింది.
18 సవర్ల బంగారం, కిలో వెండి అపహరణ
పొదలకూరురూరల్, జూలై 7 : మండలంలోని బిరదవోలు గ్రామంలో గురువారం పట్టపగలు చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరు కొందరు దుండగులు గ్రామానికి చెందిన దుగ్గిశెట్టి తిరుపాలయ్య ఇంటి తాళాలు పగల గొట్టి బీరువాలో దాచిన 18 సవర్ల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ.6వేలను అపహరించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చోరీ సమాచారంతో పొదలకూరు నుంచి ఇంటికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.3.96లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.