గంగమ్మ గుడిలో చోరీ

ABN , First Publish Date - 2021-04-23T04:58:38+05:30 IST

కొండూరు గ్రామ శివారులోని గంగమ్మ గుడి లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి హుండీలోని 30 వేల నగదు, సీసీ టీవీకి సంబంధించిన డీవీఆర్‌ను అపహరించారు.

గంగమ్మ గుడిలో చోరీ

అట్లూరు, ఏప్రిల్‌ 22:  కొండూరు గ్రామ శివారులోని గంగమ్మ గుడి లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి హుండీలోని 30  వేల నగదు, సీసీ టీవీకి సంబంధించిన డీవీఆర్‌ను అపహరించారు. ఉదయం గుడికి వెళ్లిన భక్తులు వివరించిన మేరకు చోరీ విషయాన్ని గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌, బద్వేల్‌ రూరల్‌ సీఐ రమేష్‌బాబు, బద్వేల్‌ రూరల్‌ ఎస్‌ఐ క్రిష్ణయ్య సంఘటన స్థలిని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గంగమ్మ గుడిలో ప్రవేశించి భక్తులు కానుక రూపంలో చెల్లించిన నగదు, గ్రామస్తులు గుడిలో ఏర్పాటు చేయడానికి తెచ్చిన నాలుగు సీసీ కెమెరా డీవీఆర్‌, హుండీనీ అపహరించినట్లు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసునమో దు చేసి త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.


Updated Date - 2021-04-23T04:58:38+05:30 IST