మూడు షాపుల్లో చోరీ, నగదు అపహరణ
ABN , First Publish Date - 2020-08-07T06:58:35+05:30 IST
చింతపల్లి మండల కేంద్రంలో మూడు షాపుల్లో బుధవారం రాత్రి చోరీలు జరిగాయి. శ్రీవేణుగోపాలస్వామి దుకాణంలో రూ.35వేల విలువైన సిగరేట్
చింతపల్లి, ఆగస్టు 6: చింతపల్లి మండల కేంద్రంలో మూడు షాపుల్లో బుధవారం రాత్రి చోరీలు జరిగాయి. శ్రీవేణుగోపాలస్వామి దుకాణంలో రూ.35వేల విలువైన సిగరేట్ ప్యాకెట్లు, నందిని దుకాణంలో రూ.16వేల నగదు చోరీ చేశారు. కుర్మేడు ఎక్స్రోడ్డుపై ఉన్న సాయి ఎలక్ట్రికల్ దుకాణంలో రూ.15వేల నగదును చోరీ చేశారు. బాధితులు పోలీ్సస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.