ఇలాగైతే గెలవడం కష్టమే: రఘరామకృష్ణరాజు
ABN , First Publish Date - 2022-07-19T22:23:35+05:30 IST
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘరామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేశారని, ఫలితంగా పాఠశాలలను మూసేస్తున్నారని పేర్కొన్నారు. 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు.
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘరామకృష్ణరాజు (Raghuramakrishnaraju) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేశారని, ఫలితంగా పాఠశాలలను మూసేస్తున్నారని పేర్కొన్నారు. 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే 175 సీట్లు కాదు కదా..అసలు గెలిచే స్థాన్లాల్లో గెలవడం కూడా కష్టమని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ప్రజలు చెప్పులతో నిలదీయాలని గతలో జగన్ పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.