దేశంలో కరోనా కేసుల్లేని జిల్లాలు 16 మాత్రమే
ABN , First Publish Date - 2020-07-07T07:39:14+05:30 IST
దేశంలో కరోనా కేసుల్లేని జిల్లాలు 16 మాత్రమే
చెన్నై, జూలై 6: ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. భారత్లోనూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మన దేశంలో అసలు పాజిటివ్ కేసులే నమోదు కాని జిల్లాలు ఓ గుప్పెడు మాత్రమే ఉన్నాయని ఒక వెబ్సైట్ విశ్లేషించింది. దాని ప్రకారం 16 జిల్లాల్లో కరోనా కేసులు లేవు. ఇవి లక్షద్వీప్, మిజోరం, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్లో ఉన్నాయి. కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తెలంగాణలో ప్రతి 10 పాజిటివ్లలో ఎనిమిది హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి.