థర్మల్‌ స్కానర్‌లను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-04-24T04:55:32+05:30 IST

పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ చెప్పారు.

థర్మల్‌ స్కానర్‌లను ఏర్పాటు చేయాలి

జడ్చర్ల, ఏప్రిల్‌ 23: పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ చెప్పారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసే ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. అంతకుముందు జడ్చర్ల ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద పీఓ, ఏపీఓలకు ర్యాండ మైజేషన్‌ వివరాలు, శిక్షణ కార్యక్రమాల వివరాలను అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ పద్మశ్రీ, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:55:32+05:30 IST