అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతైన వారు వీరే...

ABN , First Publish Date - 2022-07-10T16:29:09+05:30 IST

Delhi: అమర్‌నాథ్ వరదల్లో మృతుల సంఖ్య 16కు చేరింది. ఇంకా వరదల్లో చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్‌ ప్రయత్నిస్తున్నాయి. MV-17V5 హెలికాప్టర్లతో సహాయక

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతైన వారు వీరే...

Delhi: అమర్‌నాథ్ వరదల్లో మృతుల సంఖ్య 16కు చేరింది. ఇంకా వరదల్లో చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్‌ ప్రయత్నిస్తున్నాయి. MV-17V5 హెలికాప్టర్లతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇక అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతైన ఏపీవాసుల వివరాలు తెలిశాయి. గల్లంతైన వారిలో ఐదుగురు ఏపీ వాసులు వినోద్‌ అశోక్‌(విజయవాడ), గునిశెట్టి సుధా(రాజమహేంద్రవరం), మధు(తిరుపతి), ఝాన్సీలక్ష్మి(గుంటూరు), నాగేంద్ర(విజయనగరం) ఉన్నారని, వారి ఫోన్‌లు స్విచ్చాఫ్‌ కావడంతో ఆచూకీ తెలియట్లేదని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రికుల వివరాలకు ఏపీభవన్‌లో హెల్ప్‌లైన్‌ 011-23387089 ఏర్పాటు  చేశారు.  



Updated Date - 2022-07-10T16:29:09+05:30 IST