కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా NRI లను పెళ్లాడి..'తెరమరుగైన' బాలీవుడ్ బ్యూటీస్..

ABN , First Publish Date - 2021-12-23T00:32:20+05:30 IST

ఎన్నారై అల్లుడు అంటే ఇటు సామాన్యులకే కాదు.. అటు సినిమాతో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి వల్లమాలిన ప్రేమే.

కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా NRI లను పెళ్లాడి..'తెరమరుగైన' బాలీవుడ్ బ్యూటీస్..

ఎన్నారై డెస్క్: ఎన్నారై అల్లుడు అంటే ఇటు సామాన్యులకే కాదు.. అటు సినిమాతో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి వల్లమాలిన ప్రేమే. విదేశాల్లో సెటిల్ అయిన వారిని పెళ్లాడితే.. ఆ తర్వాత జీవితం అక్కడ హాయిగా గడిపేయవచ్చనే ఆశ. దీంతో చాలా మంది ఎన్నారై సంబంధాల కోసం వెతికే పనిలో ఉంటారు. ఇలా బాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు ఎన్నారైలను పెళ్లాడారు. వారి కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా ఎన్నారైలతో పెళ్లై విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. ఇలా ఎన్నారైలను పెళ్లాడి సినిమా పరిశ్రమకు దూరమైన కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం...


ముంతాజ్..

అలనాటి నటి ముంతాజ్.. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మయూర్ మధ్వాణిని పెళ్లి చేసుకున్నారు. 1974లో వీరి వివాహం జరిగింది. ముంతాజ్ పెళ్లైన సమయంలో ఆమె కెరీర్ పీక్ స్టేజీలో ఉంది. కానీ, సినిమాలను కాదని మయూర్‌ను పెళ్లాడి యూఎస్ వెళ్లిపోయారు. ఇలా ఆమె సినిమాల నుంచి మధ్యంతరంగా నిష్క్రమించారు. అప్పటికీ ఆమె ఖాతాలో బంధన్, సచ్చా ఝుతా, అప్నా దేశ్, రోటి వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. దాంతో ముంతాజ్‌ కోసం అప్పట్లో దర్శకనిర్మాతలు క్యూకట్టారు. కానీ, ఆమె తన పర్సనల్ లైఫ్ కోసం సినిమాను కాదనుకుని ఎన్నారై భర్తతో అమెరికా వెళ్లిపోయారు. 


మాధురి దీక్షిత్..

బాలీవుడ్‌తో తనకంటు ప్రత్యేక గుర్తింపుతో 90ల్లో ఓ ఊపు ఊపారు అందాల నటి మాధురి దీక్షిత్. ఎన్నో సూపర్ హిట్స్‌తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఇలా కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. 1999లో యూఎస్‌కు చెందిన ఎన్నారై సర్జన్ డా. శ్రీరామ్‌ను పెళ్లాడారు. దాంతో ఎంతో అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఇలా మాధురి సినిమాలకు దూరంగా ఎన్నారై భర్తతో లాస్ ఏంజిల్స్ సెటిలయ్యారు. అలా కొన్నేళ్లు మాధురి పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌పై దృష్టిసారించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మెల్లగా సినిమాల్లో కనిపించడం మొదలెట్టారు. 


జూహీ చావ్లా..

జూహీ చావ్లా కూడా 90ల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత 1995లో తన చిరకాల మిత్రుడు జై మెహతను పెళ్లారు. అతను యూకేకు చెందిన పారిశ్రామికవేత్త. అయితే, జూహీ తనకు పెళ్లైన విషయాన్ని చాలా సీక్రేట్‌గా ఉంచారు. ఏకంగా మొదటి బిడ్డకు తల్లి అయ్యేవరకు ఆమె ఈ సీక్రేట్‌ను మెయింటెన్ చేయడం గమనార్హం.


మీనాక్షి శేషాద్రి..

17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియాగా నిలిచారు మీనాక్షి శేషాద్రి. ఆ తర్వాత బాలీవుడ్‌లో సినిమాల్లో నటించారు. అనంతరం 1995లో అమెరికాకు చెందిన ఎన్నారై హరిష్ మైసూర్‌ను పెళ్లి చేసుకున్నారు. దీంతో సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. 


శిల్పా షెట్టి..

1993లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాజీగర్ మూవీతో శిల్పా షెట్టి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 2007లో ప్రముఖ బ్రిటిష్ సెలెబ్రిటీ షో 'బిగ్ బ్రదర్'లో శిల్పా విజేతగా నిలిచారు. ఆ షో ద్వారానే పరిచయమైన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను 2009లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 


పూజా భత్రా..

'విరాసత్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు పూజా భత్రా. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించారామె. అనంతరం కాలిఫోర్నియాలో ఉండే ఎన్నారై, అర్థోపెడిక్ డాక్టర్ సోను అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారు. కానీ, ఈ జంట 2011లో విడాకులతో విడిపోయింది.   

Updated Date - 2021-12-23T00:32:20+05:30 IST