అవి ప్రభుత్వ హత్యలు
ABN , First Publish Date - 2021-06-17T05:06:23+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయానికి టీడీపీ నాయకులతో కలసి వెళ్లిన ఆమె.. రాష్ట్రంలో పరిణామాలపై డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందించారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు రూరల్, జూన్ 16: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయానికి టీడీపీ నాయకులతో కలసి వెళ్లిన ఆమె.. రాష్ట్రంలో పరిణామాలపై డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలన్ని ప్రభుత్వ హత్యలేనన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారమందించాలన్నారు. టీడీపీ సాలూరు ఇన్చార్జి ఆర్పీభంజ్దేవ్, నేతలు తిరుపతిరావు, గోవిందరావు, లక్ష్మోజీ, అర్జున్ తదితరులు తహసీల్దార్ను కలిసిన వారిలో ఉన్నారు.