ఊరి చివర పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్న ఓ బాలిక, యువకుడు.. ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారంటే..

ABN , First Publish Date - 2021-07-28T18:03:26+05:30 IST

వారిద్దరూ బంధువులు.. వరసకు బావామరదళ్లు.. వారిద్దరూ గత ఆదివారం విగత జీవులై ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించారు..

ఊరి చివర పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్న ఓ బాలిక, యువకుడు.. ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారంటే..

వారిద్దరూ బంధువులు.. వరసకు బావామరదళ్లు.. వారిద్దరూ గత ఆదివారం విగత జీవులై ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించారు.. మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆత్మహత్యలకు గల కారణాన్ని వెలికి తీశారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా జుమ్మా ఫకీర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


జుమ్మా ఫకీర్ గ్రామానికి చెందిన చందరం (24) తనకు బంధువు, వరసకు మరదలు అయ్యే బాలికతో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో వారి ప్రేమకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని వారు నిర్ణయించుకున్నారు. దీంతో కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం సాయంత్రం ఇద్దరూ గ్రామ శివారులో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి ఆత్మహత్యలు చేసుకున్నారు. సోమవారం ఉదయం వారి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-28T18:03:26+05:30 IST