వాళ్లకు గెలిచే అర్హత లేదు.. సన్రైజర్స్పై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్!
ABN , First Publish Date - 2021-04-19T12:06:52+05:30 IST
ఈ ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
హైదరాబాద్: ఈ ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టోర్నీ ప్రారంభమైన తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఆ జట్టు ఓడిపోవడం అభిమానులకు కూడా మింగుడు పడటం లేదు. అయితే చివరి రెండు మ్యాచుల్లో కూడా గెలుపు దాకా వచ్చిన జట్టు విజయాన్ని మాత్రం అందుకోకుండానే బోర్లా పడింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ సులభంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు చివరకు ముంబైనే విజయం వరించింది.
దీనిపై మాట్లాడిన మంజ్రేకర్.. సన్రైజర్స్ జట్టులో ముగ్గురు యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్ ఆడుతున్న విషయాన్ని ఎత్తిచూపాడు. ఈ ముగ్గురు కూడా అనుభవం లేని యువ ఆటగాళ్లు. వీరిలో విరాట్ 11 పరుగులు చేయగా, అభిషేక్ కేవలం రెడు పరుగులు, అబ్దుల్ 7 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సన్రైజర్స్ జట్టు కూర్పును తప్పుబట్టిన మంజ్రేకర్.. ఆ మ్యాచ్ గెలిచే అర్హత సన్రైజర్స్ జట్టుకు లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.