రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2021-07-25T06:40:56+05:30 IST

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రెండు వేర్వేరు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం

బోయిన్‌పల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రెండు వేర్వేరు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ అక్రమ్‌ బాబా తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బోయిన్‌పల్లి బాపూజీనగర్‌ రామన్నకుంట ముందున్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఏటీఎంలోకి ప్రవేశించి అలారం వైర్‌ను కట్‌ చేశారు. అనంతరం ఓ బండరాయితో ఏటీఎంను పగులగొట్టారు. అయినా ఏటీఎంలోని క్యాష్‌ బాక్స్‌ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏటీఎంలోకి ప్రవేశించి చోరీకి విఫలయత్నం చేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-07-25T06:40:56+05:30 IST