పాఠశాలల్లో పనులు పూర్తి కావాలి

ABN , First Publish Date - 2022-05-29T05:56:03+05:30 IST

పాఠశాలల్లో పనులు పూర్తి కావాలి

పాఠశాలల్లో పనులు పూర్తి కావాలి
సమీక్షలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌


  • మనఊరు- మనబడి సమీక్షలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

మేడ్చల్‌, మే28 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మనఊరు- మనబడిలో భాగంగా మండలానికి రెండు పాఠశాలల్లో అన్ని పనులు పూర్తి చేయాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌  అధికారులను అదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మనఊరు- మనబడిపై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో మేడ్చల్‌ జిల్లాకు మంజూరైన 176 పాఠశాలలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటిని అమోదించామని, పనులు ప్రారంభించి  త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో సివిల్‌వర్క్సు, కలర్స్‌, మైనర్‌ రిపేర్స్‌, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జూన్‌ మొదటి వారంలోగా జిల్లాలోని 15 మండలాల్లోని రెండేసి చొప్పున 30 పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో డీఈవో విజయకుమారి,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:56:03+05:30 IST