ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నా: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-07-03T20:33:55+05:30 IST
Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావునుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు.
Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావునుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు.
హైదరాబాద్కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను వీహెచ్ హనుమంతరావు ఇటీవల కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్ను పరోక్షంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు.
రేవంత్ అవమానకరంగా మాట్లాడారు
‘యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవొద్దని అనడం సరికాదు. పార్టీ నిబంధనలు ధిక్కరించిన వారిని గోడకేసి కొడతా అని రేవంత్ అవమానకరంగా మాట్లాడారు. సిన్హా పర్యటన గురించి శాసనసభ్యులు, ఎంపీలతో రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయలేదు. అసలు వారితో మాట్లాడలేదు. అయితే తాను వారితో మాట్లాడానని మీడియా ముందు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకోకుండా ఏదైనా నష్టం జరిగితే ఆ నింద నాపై పడే అవకాశం ఉంది. అందుకే పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.