ఈ నెలలోనే కరోనా థర్డ్‌వేవ్... అక్టోబరుకు పీక్ స్టేజ్?

ABN , First Publish Date - 2021-08-02T13:58:27+05:30 IST

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఈ నెలలోనే...

ఈ నెలలోనే కరోనా థర్డ్‌వేవ్... అక్టోబరుకు పీక్ స్టేజ్?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నదని ఒక తాజా నివేదికలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఆగస్టులోనే రోజుకు లక్షకుపైగా కేసులు నమోదు కావచ్చని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్, కాన్పూర్‌లలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు చెందిన మథుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో పలు ఆసక్తికర వివరాల వెల్లడయ్యాయి. అక్టోబరు నాటికి దేశంలో కరోనా వైరస్ మరోమారు పీక్‌స్టేజ్‌కి చేరుకుంటుందని ఆ నివేదికలో తెలిపారు. విద్యాసాగర్ ఒక ఈ మెయిల్‌లో తెలిపిన వివరాల ప్రకారం కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఇప్పుడున్న కరో్నా పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ థర్డ్‌వేవ్ గతంలో వచ్చిన సెకెండ్‌వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-08-02T13:58:27+05:30 IST