
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 27,907 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 12,819 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.