ఓ కంపెనీ బంపర్ ఆఫర్.. ఈ ఆహారం 5 రోజుల పాటు తింటే రూ.5 లక్షలు ఇస్తాం .. !

ABN , First Publish Date - 2022-05-21T02:15:21+05:30 IST

అది బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ. పేరు ఓమ్నీ. ఇటీవలే ఆ సంస్థ ఓ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం.. తమ సంస్థ తయారు చేసిన ఆహారాన్ని వరుసగా ఐదు రోజుల పాటు తినేందుకు సిద్ధమైతే ఏకంగా 5 వేల పౌండ్లు చెల్లిస్తుంది.

ఓ కంపెనీ బంపర్ ఆఫర్.. ఈ ఆహారం 5 రోజుల పాటు తింటే  రూ.5 లక్షలు ఇస్తాం .. !

ఎన్నారై డెస్క్: అది బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ. పేరు ఓమ్నీ. ఇటీవలే ఆ సంస్థ ఓ ఉద్యోగ  ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం..  తమ సంస్థ తయారు చేసిన ఆహారాన్ని వరుసగా ఐదు రోజుల పాటు తినేందుకు సిద్ధమైతే ఏకంగా 5 వేల పౌండ్లు చెల్లిస్తుంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది అక్షరాల రూ.5 లక్షలు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారికి ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. వినడానికి ఇది బంపర్ ఆఫర్ లాగా ఉంది కదూ..! కానీ.. ఇక్కడే  కంపెనీ ఓ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే.. ఈ ఉద్యోగంలో చేరిన వ్యక్తి వరుసగా ఐదు రోజుల పాటు సంస్థ తయారు చేసిన కుక్కల ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. 


వాస్తవానికి ఈ ఉద్యోగంలో చేరే  వారి పని కుక్కల ఆహారాన్ని తినడమే!  ఐదు రోజుల  పాటు ఈ శునకాహారాన్ని తిని.. దాని రుచి ఎలా ఉంది..? అరుగుదల ఎలా ఉంది..? దీన్ని తిన్నాక  తన మూడ్‌లో ఏదైనా మార్పు వచ్చిందా..? తదితర అంశాలతో కూడిన సవివరమైన నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక.. ముడి ధాన్యం, చిలకడదుంపలు, బాఠాణీలు, వక్కలు, బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలతో ఈ కుక్కుల ఫుడ్ తయారైంది. అన్నట్టు .. ఇది కేవలం బ్రిటన్‌లో నివసించేవారికే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. కాఫీ, టీ, వైన్ రుచులను అంచానా వేసే ఉద్యోగులు ఉన్నట్టే.. ఇలా కుక్కల  ఆహారాన్ని కూడా టేస్టే ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ‘ఓమ్నీ’ ఓ సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. మరి ఈ  జాబ్ ఆఫర్ పట్ల ఎవరైనా ఆసక్తి చూపించారో లేదో తెలియాలంటే  మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. 



Updated Date - 2022-05-21T02:15:21+05:30 IST